Bookspanda
Use Code "WELCOME100" & Get Flat Rs.100 Off On Your First Purchase

APPSC Group 2 Mains: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ మళ్లీ వాయిదా పడే అవకాశం!

Nov 10, 2024
News
APPSC Group 2 Mains: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ మళ్లీ వాయిదా పడే అవకాశం!

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్ పరీక్ష షెడ్యూల్‌ను ఇటీవల కమిషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. షెడ్యూల్‌ ప్రకారం మెయిన్స్‌ గ్రూప్ -2 మెయిన్స్ పరీక్షలను 2025 జనవరి 5 నుంచి నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష మంది అభ్యర్ధులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. అయితే జనవరి 5న జరుగుతుందా? లేదా? అన్నదానిపై సందిగ్ధత నెలకొంది. అందుకు కారణం లేకపోలేదు. నేడో రేపో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఈ నెలలోనే దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసి వచ్చే ఏడాది ఫిబ్రవరి 3 నుంచి మార్చి 4వ తేదీ మధ్య రాత పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు గతంలో పరీక్షల తేదీలను కూడా వెల్లడించింది. డీఎస్సీ పరీక్షల తర్వాత ఇంటర్, పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో అన్ని చోట్ల పరీక్షా కేంద్రాలు బిజీగా ఉండనున్నాయి.

గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్ష రాసేవారిలో కొంత మంది డీఎస్సీకి కూడా హాజరవుతారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని వాటి కన్నా ముందే జనవరి 5న గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్ష నిర్వహించాలని కమిషన్‌ నిర్ణయించింది. ఈ మేరకు తెలియజేస్తూ అక్టోబర్‌ 30న ఏపీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. అయితే ప్రకటిత తేదీ నుంచి పరీక్ష రాసేందుకు మూడు నెలల వ్యవధి ఇవ్వాలని గ్రూప్ 2 అభ్యర్థులు కోరుతున్నారు. ఒకవేళ గ్రూప్‌ 2 వాయిదా వేస్తే ఏప్రిల్‌ లేదా మేలో మాత్రమే నిర్వహించేందుకు వీలుంటుంది.  ఏప్రిల్‌ వరకు పరీక్ష కేంద్రాలన్నీ బిజీ ఉంటాయి. కాబట్టి మేలో పరీక్ష జరిగే అవకాశం ఉంది. అయితే డీఎస్సీ రాత పరీక్షల తేదీలు అనుసరించి గ్రూప్‌ 2 తేదీ మార్చాలా.. వద్దా అన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని ఏపీపీఎస్సీ వర్గాలు సూచన ప్రాయంగా తెలిపాయి.

When it comes to searching for Competitive books, there is only one place to turn to the Books Panda . We are India’s largest online book store and rightly so.
Subscribe to our newsletter for regular updates about Offers, Coupons & more
Follow Us